వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
09-12-2022 Fri 11:35 | Both States
- తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానన్న లక్ష్మీనారాయణ
- ఏపీ, తెలంగాణ మళ్లీ కలిస్తే మంచిదేనని వెల్లడి
- రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్య

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు.
More Latest News
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై మరోసారి స్పందించిన అలీ
52 minutes ago

టర్కీలో మళ్లీ భూకంపం... వేలల్లో మృతుల సంఖ్య!
1 hour ago

బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!
2 hours ago

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బండి సంజయ్ స్పందన
2 hours ago

'బుట్టబొమ్మ' (మండే టాక్)
2 hours ago
