ఉప ఎన్నికలో విజయం దిశగా దివంగత ములాయం సింగ్ కోడలు డింపుల్
08-12-2022 Thu 12:29 | National
- ఎస్పీ అధినేత ములాయం మరణంతో ఖాళీ అయిన మైన్ పురి లోక్ సభ స్థానం
- అక్కడి నుంచి పోటీ పడ్డ ములాయం కోడలు
- ఇప్పటికి 55 వేల ఆధిక్యంలో దూసుకెళ్తున్న డింపుల్ యాదవ్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ నియోజవర్గ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
ఇక్కడి నుంచి ములాయం కోడలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ స్థానంపై దృష్టి సారించింది. దాంతో, మైన్ పురిపై అందరి దృష్టి నెలకొంది. ఓట్ల లెక్కింపులో డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఆమె 55 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యూపీలోని రాంపూర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలోనూ ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఆధిక్యంలో ఉన్నారు. ఖతౌలి స్థానంలో ఎస్పీ మిత్ర పక్షమైన ఆర్ ఎల్ డీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.
More Latest News
భోగాపురంలో ఒబెరాయ్ హోటల్స్కు 40 ఎకరాల కేటాయింపు!
12 minutes ago

ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
9 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
10 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
10 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
11 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
12 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
12 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
13 hours ago
