ఢిల్లీలో మూడు రోజుల పాటు లిక్కర్ బంద్
01-12-2022 Thu 15:12 | National
- మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో లిక్కర్ బంద్
- రేపు సాయంత్రం నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు నో సేల్స్
- డిసెంబర్ 7న కౌంటింగ్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి మందు బంద్ కానుంది. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ లిక్కర్ ను నిల్వ చేయడం కానీ, తరలించడం కానీ చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనుంది.
More Latest News
నారా లోకేశ్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీఎల్
25 minutes ago

కాణిపాకంలో వరసిద్ధి వినాయక ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు
38 minutes ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
59 minutes ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
1 hour ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
1 hour ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
2 hours ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
3 hours ago
