జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
01-12-2022 Thu 14:38 | National
- ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా జీ-20
- ఏడాదిపాటు జీ-20 అధ్యక్ష స్థానంలో భారత్
- ఇటీవల ఇండోనేషియాలో జీ-20 సదస్సు
- ఇండోనేషియా నుంచి అధ్యక్ష బాధ్యతలు భారత్ కు బదిలీ

బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ఆ సమావేశంలో ప్రకటించారు.
భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు.
More Latest News
నారా లోకేశ్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీఎల్
16 minutes ago

కాణిపాకంలో వరసిద్ధి వినాయక ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు
29 minutes ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
50 minutes ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
1 hour ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
1 hour ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
2 hours ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
2 hours ago
