చైనా జిబౌతీ మిలిటరీ బేస్ తో భారత్ కు ముప్పు: అమెరికా
01-12-2022 Thu 09:04 | International
- ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధనౌకలను మోహరించే అవకాశం
- భారత్ కు పెను సవాల్ గా మారుతుందన్న అమెరికా రక్షణశాఖ
- ఇండియా పసిఫిక్ ప్రాంతంలో మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరించే పనిలో చైనా ఉందని వెల్లడి

జిబౌతీలో చైనా ఏర్పాటు చేసిన మిలిటరీ బేస్ తో భారత్ కు ముప్పు ఉందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. ఈ మిలిటరీ బేస్ లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, భారీ యుద్ధ నౌకలను చైనా మోహరించే అవకాశం ఉందని తన వార్షిక నివేదికలో యూఎస్ రక్షణశాఖ వెల్లడించింది. ఈ మిలిటరీ బేస్ భారత్ కు పెను సవాలుగా మారుతుందని అంచనా వేసింది. ఈ బేస్ లో అదనపు మిలిటరీ లాజిస్టిక్స్ వసతుల ఏర్పాటును కూడా చైనా పరిశీలిస్తోందని చెప్పింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఇప్పటికే అక్రమంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోందని.... దీనికి తోడు ఇండియా పసిఫిక్ ప్రాంతంలో తన మిలిటరీ సామర్థ్యాన్ని మరింత విస్తరించే పనిలో ఉందని చెప్పింది. ఈమేరకు అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన నివేదికలో యూఎస్ రక్షణశాఖ వెల్లడించింది.
More Latest News
కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్!
5 hours ago

ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... నాకు పాత వాహనమా?: రాజాసింగ్
5 hours ago

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు
6 hours ago

'పఠాన్' మూవీపై కంగనా రనౌత్ స్పందన
9 hours ago
