జయలలిత మృతి కేసు: శశికళ సహా పలువురిపై విచారణ!
30-08-2022 Tue 07:02 | National
- జయ మృతిపై ఇటీవల నివేదిక సమర్పించిన అర్ముగస్వామి కమిషన్
- శశికళ, శివకుమార్, అప్పటి ఆరోగ్యమంత్రి తదితరులపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని ప్రతిపాదన
- నిన్న సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం
- న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయం

జయలలిత మృతి కేసుకు సంబంధించి శశికళ సహా పలువురిని విచారించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. జయ మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్కు నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్, అప్పటి ఆరోగ్యమంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు తదితరులను ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం స్టాలిన్ నేతృత్వంలో మంత్రివర్గం నిన్న సాయంత్రం సమావేశమైంది. కమిషన్ సిఫార్సులపై తొలుత న్యాయ నిపుణులతో చర్చించాకే ముందుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది.
More Latest News
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్
28 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
10 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
11 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
12 hours ago
