తెలుగు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులకు విందు ఇచ్చిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
29-06-2022 Wed 19:57
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కోసం చండీగఢ్ వెళ్లిన ఆర్థిక మంత్రులు
- రాజేంద్రనాథ్, హరీశ్లను విందుకు ఆహ్వానించిన దత్తాత్రేయ
- ట్విట్టర్లో ఫొటోలను షేర్ చేసిన హర్యానా గవర్నర్

తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావులకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విందు ఇచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల కోసం ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు బుధవారం హర్యానా, పంజాబ్ ఉమ్మడి రాజధాని చండీగఢ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులను తన అధికారిక నివాసానికి ఆహ్వానించిన దత్తాత్రేయ వారికి విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇద్దరు ఆర్థిక మంత్రులను దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. ఇద్దరు మంత్రులకు ఆయన జ్ఞాపికలను కూడా అందజేశారు. ఈ విషయాన్ని దత్తాత్రేయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులను సన్మానించడం తనకు సంతోషాన్నిచ్చిందని దత్తాత్రేయ సదరు ట్వీట్లో పేర్కొన్నారు.
More Latest News
బ్యాంకును దోచేద్దామని.. సొరంగం తవ్వుతుంటే ప్రమాదం
15 minutes ago

ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!
31 minutes ago

జబర్ధస్త్ నుంచి బయటకు రావటానికి గల కారణం చెప్పిన అనసూయ
37 minutes ago

వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం
55 minutes ago

‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు
1 hour ago
