పారిస్ బయలుదేరిన ఏపీ సీఎం జగన్... జులై 3న తిరిగి రాక
28-06-2022 Tue 19:55
- కూతురు కళాశాల స్నాతకోత్సవం కోసం పారిస్కు జగన్
- ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఏపీ సీఎం
- జగన్కు వీడ్కోలు పలికిన పలువురు మంత్రులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో పారిస్ బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్కు ఆయన కేబినెట్లోని పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు.
పారిస్లో చదువుతున్న తన కూతురు కళాశాల స్నాతకోత్సవానికి జగన్ వెళుతున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్... తన పారిస్ టూర్కు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. పారిస్లో పర్యటించేందుకు జగన్కు 10 రోజుల పాటు కోర్టు అనుమతించింది. ఈ పర్యటన ముగించుకుని జగన్ జులై 3న తిరిగి రానున్నారు.
More Latest News
యూపీలో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన యువకుడి అరెస్ట్
20 minutes ago

పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో
2 hours ago

‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి
2 hours ago
