మరో రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
28-06-2022 Tue 18:45
- 7.95 శాతం వడ్డీకి తాజా రుణం
- కేంద్రం అనుమతించిన రుణ పరిమితిలోనే కొత్త అప్పు
- రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలం ద్వారా రుణ సేకరణ

ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకుంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్ల వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లను రుణంగా తీసుకుంది.
ఈ కొత్త రుణాన్ని ఏపీ ప్రభుత్వం 7.95 శాతం వడ్డీకి సేకరించింది. ఈ రుణాన్ని కేంద్రం అనుమతించిన రుణ పరిమితి నుంచే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఇదిలా ఉంటే... గత మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల రుణాన్ని సేకరించింది.
More Latest News
మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
8 minutes ago

రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు పాదయాత్రకు దూరం
14 minutes ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
50 minutes ago

కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే!
1 hour ago

ఇక మాస్కులు ధరించక్కర్లేదంటున్న ఉత్తర కొరియా
1 hour ago

భారీ ఫ్లాప్ తప్పించుకున్న విజయ్ సేతుపతి
2 hours ago

రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా!
2 hours ago
