మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు గారు: చంద్రబాబు
28-06-2022 Tue 14:30
- నేడు పీవీ 101వ జయంతి
- నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
- దేశాన్ని గట్టెక్కించిన నేత అని కొనియాడిన చంద్రబాబు
- టీడీపీ కార్యాలయంలో పీవీకి పుష్పాంజలి

భారత దేశాన్ని ఆధునిక మార్గం పట్టించిన సంస్కరణలకు ఆద్యుడు, తెలుగుజాతి గర్వించదగిన నేత పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పీవీని స్మరించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేశారని, ప్రధానిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని కొనియాడారు. మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు గారు అంటూ చంద్రబాబు కీర్తించారు. తెలుగు వెలుగు పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి దేశసేవను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఆఫీసులో పీవీ చిత్రపటానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు.
More Latest News
సరికొత్త హెయిర్ స్టయిల్ తో మహేశ్ బాబు... ఫొటో ఇదిగో!
8 minutes ago

ప్రపంచంలో 4 వేల పులులు ఉన్నాయి.. కానీ రాహుల్ ద్రావిడ్ ఒక్కడే: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్
8 minutes ago

విజయనగరం జిల్లాలో దొరికిన లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు!
27 minutes ago

ఇంతటి భిన్నత్వంలోనూ సమర్థంగా నెట్టుకువస్తున్న భారత్ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
47 minutes ago

ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!
1 hour ago

వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం
1 hour ago

‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు
2 hours ago
