బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన
26-06-2022 Sun 19:19
- నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ
- బండ్లగూడలో అమ్మకానికి 2,246 ఫ్లాట్లు
- పోచారంలో అమ్మకానికి 5,921 ఫ్లాట్లు
- లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల అమ్మకం
- రేపటి నుంచి లాటరీ ప్రక్రియ షురూ

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ సృగృహ ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభిస్తోంది. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వచ్చాయి. పోచారంలో 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. రేపటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు.
ఈ నెల 27న పోచారంలోని ఫ్లాట్లకు, ఈ నెల 28న బండ్లగూడలోని ఫ్లాట్లకు డ్రా తీస్తారు. రేపు ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియను ఫేస్ బుక్, యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. లాటరీ షెడ్యూల్, ఇతర వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు.
More Latest News
73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
16 minutes ago

కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే!
27 minutes ago

ఇక మాస్కులు ధరించక్కర్లేదంటున్న ఉత్తర కొరియా
1 hour ago

భారీ ఫ్లాప్ తప్పించుకున్న విజయ్ సేతుపతి
1 hour ago

రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా!
2 hours ago
