జనసేనలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్
23-06-2022 Thu 21:06
- రాజోలుకు చెందిన వరప్రసాద్
- 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వైనం
- హైదరాబాద్లో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిక

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ జనసేన స్పీడును పెంచేస్తున్నట్లుగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన స్పీడుకు అనుగుణంగానే ఆ పార్టీలోకి కొత్తగా చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ కేడర్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన దేవ వరప్రసాద్ నేడు జనసేనలో చేరిపోయారు.
హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలోనే వరప్రసాద్ జనసేనలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఏపీ ప్రభుత్వంలో పలు హోదాల్లో 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు.
More Latest News
దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
5 minutes ago

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
20 minutes ago

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్’ సెక్యూరిటీ
22 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
40 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago
