సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అడివి శేష్ 'మేజర్'
24-05-2022 Tue 17:44
- సంచలనం సృష్టించిన ముంబయి ఉగ్రదాడులు
- వీరోచితంగా పోరాడి, అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్
- నిజజీవిత గాథతో రూపుదిద్దుకున్న 'మేజర్'
- సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్.. జూన్ 3న రిలీజ్

ముంబయి ఉగ్రదాడుల అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం 'మేజర్'. అడివి శేష్ ఇందులో మేజర్ సందీప్ గా నటించాడు. ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 'మేజర్' చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది.
శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడివి శేష్ తో పాటు సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లు పాలుపంచుకున్నాయి. ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.
More Latest News
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
10 minutes ago

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్’ సెక్యూరిటీ
12 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
30 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago
