ఏపీలో బీజేపీ, జనసేన విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు: ఉండవల్లి
24-05-2022 Tue 15:37
- ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం
- ఆసక్తికరంగా పొత్తుల విషయం
- టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చన్న ఉండవల్లి
- ముక్కోణపు పోరు ఉండదని భావిస్తున్నానని వ్యాఖ్య

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా, పొత్తుల గురించిన అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనిపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ, జనసేన విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు చూస్తుంటే టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.
ఏదేమైనా ఏపీలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు ఉండదని భావిస్తున్నానని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీలో సీఎం జగనే కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులు ఉండకపోవచ్చని, ఏపీలో రాజకీయం ఎలా ఉంటే మనకేంటని బీజేపీ భావిస్తే మాత్రం పొత్తులు ఉంటాయని వివరించారు.
More Latest News
దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
2 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
22 minutes ago

మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై శత్రుచర్ల కుటుంబీకుల ఫైర్
58 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago
