తెలంగాణకు మరో భారీ పెట్టుబడిని రాబట్టిన కేటీఆర్
24-05-2022 Tue 15:06
- దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- నిన్న స్విస్ రే బీమా సంస్థతో ఒప్పందం
- నేడు అలియాక్సిస్ సంస్థతో చర్చలు
- తెలంగాణలో ఆశీర్వాద్ పైప్స్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో భారీ పెట్టుబడిని సాధించారు. నిన్న స్విస్ రే బీమా సంస్థ హైదరాబాదులో కార్యాలయం ఏర్పాటుకు మొగ్గు చూపగా, నేడు ఆశీర్వాద్ పైప్స్ సంస్థ తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ యూనిట్ ఏర్పాటు వ్యయం రూ.500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఆశీర్వాద్ పైప్ పరిశ్రమ ఏర్పాటుతో వందలాది ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆశీర్వాద్ పైప్స్ మాతృసంస్థ 'అలియాక్సిస్' సీఎఫ్ఓ కోయెన్ స్టికర్ నేడు దావోస్ లో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనేక అంశాల్లో చర్చల అనంతరం తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
More Latest News
తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ జట్టు... ఫైనల్లో ముంబయి జట్టుపై గ్రాండ్ విక్టరీ
17 minutes ago

ఇది బీజేపీ చిల్లర రాజకీయాలకు ఎదురుదెబ్బ: కేజ్రీవాల్
25 minutes ago

దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
41 minutes ago

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
56 minutes ago

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్’ సెక్యూరిటీ
58 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
1 hour ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
2 hours ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
2 hours ago
