క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు జపాన్ పయనమైన మోదీ
22-05-2022 Sun 21:16
- జపాన్ లో క్వాడ్ దేశాల సదస్సు
- ఈ నెల 24న టోక్యోలో సమావేశం
- ప్రత్యేక విమానంలో పయనమైన మోదీ
- బైడన్ తో నేరుగా భేటీ అయ్యే అవకాశం

క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం జపాన్ బయల్దేరి వెళ్లారు. టోక్యోలో మే 24న క్వాడ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లు, అవకాశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా, కరోనా అనంతర పరిస్థితులు, ఆరోగ్య భద్రత, సుస్థిర మౌలిక సదుపాయాలు, వస్తు సరఫరా వ్యవస్థలు తదితర అంశాలపైనా చర్చించనున్నారు.
కాగా, ప్రధాని మోదీ దాదాపు 40 గంటల పాటు జపాన్ గడ్డపై గడపనున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ నేరుగా సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీలో ఉక్రెయిన్ పైనా చర్చిస్తారని తెలుస్తోంది.
More Latest News
బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
19 minutes ago

మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై శత్రుచర్ల కుటుంబీకుల ఫైర్
55 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago

సముద్రంలోంచి దేవత ఎగిరొస్తున్నట్టుగా..
2 hours ago
