అవినీతి, అవినీతి అంటున్నారు.. ఏ వ్యవస్థలో లేదో చెప్పండి: ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు
23-04-2022 Sat 15:08
- పదేపదే అవినీతి అనడం సరికాదన్న బొప్పరాజు
- సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను శుద్ధంగా ఉండమంటే ఎలా అని నిలదీత
- 25న ప్రభుత్వంతో జరిగే సమావేశంలో పీఆర్సీ జీవోలపై ప్రశ్నిస్తామన్న బొప్పరాజు

ఏపీ రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పదేపదే అంటున్నారని, ఏ వ్యవస్థలో అవినీతి లేదో చెప్పాలని ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సౌకర్యాల లేమి, వసతుల కొరతపై దృష్టిపెట్టడం మాని పదేపదే అవినీతి అంటూ ప్రచారం చేయడం ఏం బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను శుద్ధంగా ఉండమంటే ఎలా అని నిలదీశారు.
గుడివాడలో ఆర్ఐపై ఇసుక మాఫియా దాడి గురించి బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం సరికాదని అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిపై అందరూ తమను దోషులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న ప్రభుత్వంతో జరగనున్న సమావేశంలో పీఆర్సీపై జీవోల జారీ గురించి ప్రశ్నిస్తామని బొప్పరాజు తెలిపారు.
More Latest News
రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపై షర్మిల విమర్శలు
3 hours ago

తెలంగాణలో 500కి దిగువన కరోనా కొత్త కేసులు
3 hours ago

రద్దీ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి
4 hours ago

వాళ్ల ఫస్టు మూవీ నాతోనే చేశారు: నితిన్
6 hours ago

సుధీర్ బాబు సినిమా అప్ డేట్
7 hours ago
