మహిళల ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
10-03-2022 Thu 06:32
- తొలి మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్
- ఓపెనర్ షెఫాలీ వర్మ స్థానంలో యస్తిక భాటియా
- వన్డే సిరీస్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న మిథాలీ సేన

ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భాగంగా మారికాసేపట్లో భారత్-ఆతిథ్య న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మిథాలీ సేన టాస్ గెలిచి కివీస్కు బ్యాటింగ్ అప్పగించింది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి జయకేతనం ఎగురవేసిన భారత్.. న్యూజిలాండ్పైనా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.
భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ షెఫాలీ వర్మ స్థానంలో యస్తిక భాటియా జట్టులోకి వచ్చింది. న్యూజిలాండ్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది. కాగా, ప్రపంచకప్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో భారత జట్టు 1-4 తేడాతో ఓటమి పాలైంది. నేటి మ్యాచ్లో గెలిచి సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మిథాలీ సేన గట్టి పట్టుదలగా ఉంది.
More Latest News
చిప్ ఆధారిత పాప్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
2 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
6 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
37 minutes ago

'స్వాతిముత్యం' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!
55 minutes ago

హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
1 hour ago

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
1 hour ago

నిరాశపరిచిన సీనియర్ నటి అర్చన రీ ఎంట్రీ!
1 hour ago
