‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’ యాప్స్, సోషల్ మీడియా ఖాతాలపై వేటు
22-02-2022 Tue 13:47
- బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార శాఖ ఆదేశం
- వీటిల్లోని కంటెంట్ మత సామరస్యానికి చేటు
- దేశ సార్వభౌమత్వానికి ముప్పు అంటూ ప్రకటన

నిషేధిత సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్ జే) తో సంబంధాలు కలిగిన పంజాబ్ పాలిటిక్స్ టీవీ.. యాప్స్, సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి నడుస్తున్న పంజాబ్ పాలిటిక్స్ టీవీ ఆన్ లైన్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలను ఎస్ఎఫ్ జే చేస్తున్నట్టు పేర్కొంది. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
‘‘యాప్ లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న కంటెంట్ మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. వేర్పాటు వాద భావజాలం భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తుంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో కొత్త యాప్ లు, కొత్త సోషల్ మీడియా ఖాతాలను తెరవడాన్ని గుర్తించాం’’ అని తన ఆదేశాల్లో వివరించింది.
More Latest News
కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
10 minutes ago

ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు.... కేంద్రంలో మళ్లీ మోదీనే.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...!
19 minutes ago

భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లు.. నేటి నుంచి ఐదు రోజుల్లో నాలుగు గ్రహ శకలాలు రానున్నట్టు నాసా వెల్లడి
29 minutes ago

రఘురామకృష్ణరాజు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
28 minutes ago

నా తోడబుట్టిన అన్నతో పాటు దేవుడిచ్చిన ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల
1 hour ago

మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
1 hour ago

చెయ్యి ఎత్తితే తగిలేంతగా.. బీచ్ పక్కన ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కలకలం! వీడియో ఇదిగో..!
1 hour ago
