మోదీకి పిల్లలు పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: లాలూ ప్రసాద్ యాదవ్
11-02-2022 Fri 16:34
- వంశపారంపర్య రాజకీయాల వల్ల దేశం నాశనమవుతోందన్న మోదీ
- మోదీకి పిల్లలు లేకపోతే నేనేం చేయగలనన్న లాలూ
- వారికి పిల్లలు పుట్టి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లకు పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. వారిద్దరికీ పిల్లలు పుట్టాలని, వారు కూడా వంశపారంపర్య రాజకీయాలు అనే వాదనలో చేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ వంశపారంపర్య రాజకీయాలు దేశానికి చేటు తెస్తాయని అన్నారు.
మోదీకి పిల్లలు లేకపోతే తానేం చేయగలనని, నితీశ్ కు ఒక కుమారుడు ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలకు తగినవాడు కాదని... దీనికి తానేం చేయగలనని లాలూ ఎద్దేవా చేశారు. వారి పిల్లలు కూడా వంశపారంపర్య రాజకీయాల్లో చేరేలా వారికి కూడా పిల్లలు పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.
More Latest News
పార్కింగ్ కు స్థలం లేదు.. కూర్చునేందుకు కుర్చీలు లేవు.. వై ఫై రాదు.. ప్రపంచ కుబేరుడి కంపెనీలో ఉద్యోగుల కష్టాలెన్నో!
9 minutes ago

చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!
29 minutes ago

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
39 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
41 minutes ago

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
50 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
1 hour ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
1 hour ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
