గనులశాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం!
05-02-2022 Sat 17:26
- గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి పేరిట ఉత్తర్వులు
- చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఏమిటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు
- గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్న

పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరికి ఆర్టీసీ ఉద్యోగులు సైతం జత కలిశారు. రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగబోతున్నారు. మరోవైపు ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. మరోవైపు ఉద్యోగులపై తమ మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.
మరోపక్క ఉద్యోగులపై ఏపీ గనుల శాఖ ఎస్మా ప్రయోగించింది. గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై గనుల శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే ఎస్మా ఉత్తర్వులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.
More Latest News
ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
43 seconds ago

ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
23 minutes ago

సంజయ్ రౌత్కు మరోమారు ఈడీ సమన్లు
27 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
35 minutes ago

ఎంఎస్ స్వామినాథన్కు వెంకయ్య పరామర్శ
41 minutes ago

దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
57 minutes ago

టీహబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
1 hour ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
1 hour ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
1 hour ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
1 hour ago
