ఏపీలో మరో 14,502 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!
24-01-2022 Mon 17:35
- గత 24 గంటల్లో 40,266 కరోనా పరీక్షలు
- విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు
- పలు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు
- రాష్ట్రంలో ఏడుగురి మృతి
- ఇంకా 93,305 మందికి చికిత్స

ఏపీలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 40,266 శాంపిల్స్ పరీక్షించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,610 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,597 కేసులు, కర్నూలు జిల్లాలో 1,551 కేసులు, కడప జిల్లాలో 1,492 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,198 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 4,800 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు.
తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,549కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 21,95,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,87,282 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 93,305 మంది చికిత్స పొందుతున్నారు.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
8 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
8 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
9 hours ago

ఈ సభ చూస్తే జగన్ కు పిచ్చెక్కడం ఖాయం: చంద్రబాబు
10 hours ago
