సోదరుడి దశదిన కర్మకాండలకు హాజరైన మహేశ్ బాబు
22-01-2022 Sat 17:11
- ఈ నెల 8న మరణించిన రమేశ్ బాబు
- కాలేయవ్యాధితో బాధపడుతూ కన్నుమూత
- దశదిన కర్మ నిర్వహణ
- రమేశ్ బాబు నివాసానికి వచ్చిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు (56) ఈ నెల 8న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, రమేశ్ బాబు దశ దిన కర్మకాండలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు హాజరయ్యారు. రమేశ్ బాబు నివాసంలో ఈ కర్మకాండలు నిర్వహించారు. కాగా, సోదరుడు మరణించిన సమయంలో మహేశ్ బాబు కరోనా కారణంగా ఐసోలేషన్ లో ఉన్నారు. దాంతో అన్నయ్యను కడసారి చూసేందుకు వీల్లేకపోయింది.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
9 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
9 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
10 hours ago

ఈ సభ చూస్తే జగన్ కు పిచ్చెక్కడం ఖాయం: చంద్రబాబు
11 hours ago
