ఓటీటీలో వస్తున్న 'మళ్లీ మొదలైంది'
20-01-2022 Thu 21:46
- సుమంత్ తాజా చిత్రం 'మళ్లీ మొదలైంది'
- వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లు
- ఫిబ్రవరిలో జీ5లో విడుదల కానున్న చిత్రం

సుమంత్ నటించిన తాజా చిత్రం 'మళ్లీ మొదలైంది' ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో సుమంత్ భార్య పాత్రలో వర్షిణీ సౌందర్ రాజన్ నటించింది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితోనే ప్రేమలో పడితే ఏంటనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
మహిళా న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. రేపు జీ5 ఓటీటీలో 'లూజర్' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అనంతరం 'మళ్లీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
10 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
10 hours ago

మహానాడు నేపథ్యంలో విజయసాయిరెడ్డి విమర్శల పర్వం
11 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
11 hours ago
