జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కించుకున్న కడప జిల్లా
08-01-2022 Sat 09:55
- నేషనల్ వాటర్ అవార్డు-2020ని దక్కించుకున్న కడప జిల్లా
- నీటి సంరక్షణ కోసం చేసిన కృషికి అవార్డు
- 2018 నుంచి ఈ అవార్డులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. జాతీయ జల అవార్డులు-2020లో మొత్తం 11 విభిన్న విభాగాలకు గాను 57 అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ఈ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకు మాత్రమే అవార్డు వచ్చింది. దక్షిణాది రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం జిల్లాకు తొలి స్థానం దక్కగా... ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది.
నీటి సంరక్షణ కోసం కృషి చేసిన జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, నీటి వినియోగ సంఘాలకు నేషనల్ వాటర్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తోంది. 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోంది.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
1 hour ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
2 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
3 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
3 hours ago
