సమంతపై కంటెంట్ ను వెంటనే తొలగించండి... యూట్యూబ్ చానళ్లకు కోర్టు ఆదేశం
26-10-2021 Tue 18:48
- విడిపోతున్నట్టు ప్రకటించిన సమంత, నాగచైతన్య
- విపరీతస్థాయిలో కథనాలు
- కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించిన సమంత
- ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేసిన కోర్టు

ఇటీవల సమంత, నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించిన సమయంలో వారి విడాకులపై అనేక కథనాలు వచ్చాయి. అయితే సీఎల్ వెంకట్రావు అనే వ్యక్తితో పాటు పలు యూట్యూబ్ చానళ్లు తన వ్యక్తిగత జీవితంపై ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. సమంతపై కోర్టులో నేడు విచారణ కొనసాగించింది.
సమంతపై కంటెంట్ ను యూట్యూబ్ చానళ్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. సీఎల్ వెంకట్రావు సైతం తన కంటెంట్ ను తొలగించాలని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని, అదే సమయంలో సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది.
More Latest News
30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
8 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
11 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
12 minutes ago

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
19 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
38 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో పాసైన అవిభక్త కవలలు వీణా-వాణి
54 minutes ago

సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడంతో పెద్ద హీరోలకు తీరని నష్టం: నిర్మాత బన్నీ వాసు
59 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
1 hour ago
