కశ్మీర్లో వలస కూలీల ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలి: విజయసాయిరెడ్డి
18-10-2021 Mon 16:27
- జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు
- 24 గంటల వ్యవధిలో 3 దాడులు జరిగాయన్న విజయసాయి
- మరో ఇద్దరు బీహారీలు మరణించారని వెల్లడి

జమ్మూ కశ్మీర్ లో వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగిపోవడం హేయమైన, పిరికిపంద చర్య అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు బీహార్ కూలీలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి అని తెలిపారు.
గత రెండు, మూడ్రోజుల వ్యవధిలోనే 11 మంది సాధారణ పౌరులు మరణించారని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో నిరుపేద వలస కూలీల ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
More Latest News
పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
10 minutes ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
28 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
34 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
2 hours ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
2 hours ago
