దసరా తిరుగు ప్రయాణాలు ఆరంభం.. హైదరాబాద్కు 150 బస్సులు రెడీ చేసిన ఏపీఎస్ ఆర్టీసీ
17-10-2021 Sun 07:49
- రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులు
- రేపటి నుంచి అంతర్ జిల్లా బస్సులు అందుబాటులోకి
- ప్రత్యేక బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ షురూ

దసరా సెలవులు ముగుస్తుండడంతో తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా హైదరాబాద్కు 150 సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు ఆదివారం కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది. ప్రత్యేక బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ప్రారంభించింది.
ఒకటి, రెండు జిల్లాల మధ్య ప్రయాణించేవారితో రేపు తెల్లవారుజాము నుంచి రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ఉదయం నుంచి అంతర్ జిల్లా సర్వీసులను కూడా అదనంగా నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన చోట్ల అదనపు బస్సులు నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
More Latest News
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్!
17 minutes ago

ఆఫీసుకి రావాల్సిందే అన్నాడు.. వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు.. ప్రపంచ కుబేరుడి కంపెనీలో ఉద్యోగుల కష్టాలెన్నో!
28 minutes ago

చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!
48 minutes ago

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
57 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
1 hour ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
1 hour ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
1 hour ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
2 hours ago
