పోలింగ్ సమయం పెంచారు... ఓటు వేయని వారు సద్వినియోగం చేసుకోండి: మంచు విష్ణు
10-10-2021 Sun 14:27
- నేడు మా ఎన్నికల పోలింగ్
- ఉదయం 8 గంటలకు ప్రారంభం
- మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సిన వైనం
- ఇంకా కొందరు ఓటు వేయలేదన్న విష్ణు
- పోలింగ్ అధికారి సమయం పెంచారని వివరణ

మా ఎన్నికల పోలింగ్ కు అదనపు సమయం కేటాయించినట్టు మంచు విష్ణు వెల్లడించారు. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సి అయింది. అయితే కొన్ని కారణాలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఓటింగ్ కు సకాలంలో రాలేకపోయిన వారి కోసం పోలింగ్ అధికారి కొంత అదనపు సమయం ఇచ్చినట్టు విష్ణు తెలిపారు.
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ జామ్ కారణంగా కొందరు రాలేకపోయినట్టు తెలిసిందని, అలాంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా వచ్చి తమ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని మంచు విష్ణు స్పష్టం చేశారు.
More Latest News
ఎంఎస్ స్వామినాథన్కు వెంకయ్య పరామర్శ
2 minutes ago

దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
18 minutes ago

టీహబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
23 minutes ago

రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
37 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
49 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
52 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
53 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
1 hour ago
