ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబానికి షర్మిల పరామర్శ
20-07-2021 Tue 14:08
- గంగదేవిపాడులో షర్మిల నిరుద్యోగ దీక్ష
- నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఓదార్పు
- కుటుంబానికి అండగా ఉంటామని హామీ

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంగదేవిపాడుకు వెళ్లిన ఆమె.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు.
ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కష్టాలు విని చలించిపోయిన ఆమె.. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి.. దీక్షలో కూర్చున్నారు.
More Latest News
తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
2 hours ago

దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా
2 hours ago

నిజంగా మేము చాలా టెన్షన్ పడ్డాము: నిఖిల్
3 hours ago
