బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై మోసం కేసు.. 13న విచారణకు రావాలంటూ సమన్లు
09-07-2021 Fri 10:00
- బీయింగ్ హ్యూమన్ జువెలరీ బ్రాండ్ స్టోర్ ఏర్పాటు
- సహకారం ఇస్తామని మోసం చేశారంటూ చండీగఢ్ వ్యాపారవేత్త ఫిర్యాదు
- సల్మాన్, ఆయన సోదరి అల్విరా సహా 8 మందిపై కేసు

చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై మోసం కేసు నమోదైంది. 2018లో రూ. 2-3 కోట్లతో తాను ఏర్పాటు చేసిన ‘బీయింగ్ హ్యూమన్ జువెలరీ’ బ్రాండ్ స్టోర్కు అవసరమైన సహాయ సహకారాలతోపాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈవో హామీ ఇచ్చారని వ్యాపారవేత్త అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, హామీ మేరకు వారి నుంచి తనకు ఎలాంటి సహకారమూ అందలేదని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చండీగఢ్ పోలీసులు సల్మాన్, అల్విరాఖాన్తోపాటు మొత్తం 8 మందికి సమన్లు జారీ చేశారు. విచారణ కోసం ఈ నెల 13న తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
More Latest News
భారతీయుల పెట్టుబడుల్లో అత్యధికం రియల్టీలోనే..!
21 minutes ago

చిప్ ఆధారిత పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
44 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
47 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
1 hour ago

హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
2 hours ago
