వరల్డ్ చాంపియన్ బాక్సర్ ను మట్టికరిపించిన తెలంగాణ అమ్మాయి
19-03-2021 Fri 22:07
- ఇస్తాంబుల్ లో బాస్ఫరస్ బాక్సింగ్ టోర్నీ
- సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన నిఖత్ జరీన్
- క్వార్టర్ ఫైనల్లో నజీమ్ కైజాబేపై విజయం
- అంతకుముందు ప్రీక్వార్టర్స్ లోనూ వరల్డ్ చాంపియన్ పై గెలుపు

టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతున్న బాస్ఫరస్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సంచలనాల మోత మోగిస్తోంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్ రెండుసార్లు వరల్డ్ చాంపియన్ నజీమ్ కైజాబే (కజకిస్థాన్)ను ఓడించింది. ఈ విజయంలో నిఖత్ 51 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరింది.
అంతకుముందు, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోనూ నిఖత్ 2019 వరల్డ్ చాంపియన్ పాల్ట్ సెవా ఎక్తరీనా (రష్యా)ను మట్టికరిపించడం విశేషం. ఇవాళ్టి క్వార్టర్ ఫైనల్స్ లోనూ అదే తెగువ చూపించిన తెలంగాణ తేజం 4-1తో నెగ్గింది. సెమీస్ చేరడం ద్వారా నిఖత్ జరీన్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇదే ఊపు కొనసాగిస్తే మాత్రం పసిడి పతకం ఖాయమని చెప్పొచ్చు. అదే సమయంలో ఇతర భారత మహిళా బాక్సర్లు తమ కేటగిరీల్లో పరాజయం పాలయ్యారు.
More Latest News
దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
1 minute ago

టీ హబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
7 minutes ago

రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
20 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
33 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
36 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
36 minutes ago

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
44 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
1 hour ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago
