ఓటుకు నోటు కేసులో పిటిషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
08-03-2021 Mon 21:52
- సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
- నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి
- విచారణ నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి
- పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని వివరణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ హైదరాబాదు ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది. ఇటీవల ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసు విచారణను వేగవంతం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 8 వరకు విచారణ వాయిదా వేయాలని తన పిటిషన్ లో కోరారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తాను హాజరు కావాల్సి ఉందని, అందుకే కేసు విచారణను నెల రోజుల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ... రేవంత్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అనంతరం కోర్టు మంగళవారానికి వాయిదా పడింది.
More Telugu News
యధార్థ సంఘటన ఆధారంగా రవితేజ న్యూ మూవీ!
2 minutes ago

ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మేజర్' టీజర్!
33 minutes ago

ఏనాడూ బొట్టు పెట్టుకోని వ్యక్తి.. తిరుపతి ఎన్నికల కోసం నామాలు పెట్టుకుంటున్నారు: సునీల్ దేవధర్ పై పేర్ని నాని వ్యంగ్యం
41 minutes ago

మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
51 minutes ago

మమతా బెనర్జీ క్లీన్ బౌల్డ్ అయ్యారు: మోదీ
1 hour ago

అలా అంటున్నారంటే.. ఏడుకొండలవాడిపై విశ్వాసం లేదని జగన్ రెడ్డి ఒప్పుకుంటున్నట్టే కదా?: అచ్చెన్నాయుడు
1 hour ago
