ప్రజలను మభ్యపెట్టేందుకే గంటా రాజీనామా: విష్ణుకుమార్ రాజు
22-02-2021 Mon 20:13
- రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
- ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
- చంద్రబాబుతో గంటా చర్చించలేదన్న విష్ణు
- గంటా అనుచరుల సంగతి ప్రజలే చూస్తారని వెల్లడి

ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకే గంటా రాజీనామా చేశారని అని ఆరోపించారు. రాజీనామా చేసే ముందు చంద్రబాబుతో గంటా చర్చించలేదని తెలిపారు. గంటా రాజీనామాతో ఆయన అనుచరులు పార్టీలో ఉంటారో, మారతారో ప్రజలే చూస్తారని అన్నారు. అయినా గంటా రాజీనామా ఆమోదం పొందదని అభిప్రాయపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. ప్రస్తుతం ఈ రాజీనామా స్పీకర్ తమ్మినేని సీతారాం పరిధిలో ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
Advertisement 2
More Telugu News
మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
2 minutes ago

ఏపీలో గడచిన 24 గంటల్లో 106 మందికి కరోనా నిర్ధారణ
43 minutes ago

చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
53 minutes ago

Advertisement 3
స్టాక్ మార్కెట్: నేడు కూడా లాభాలే!
1 hour ago

'డి కంపెనీ' మోషన్ పోస్టర్ ను పంచుకున్న వర్మ
2 hours ago

82 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం: మోదీ
3 hours ago

Advertisement 4