బీజేపీ నేతలు చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలి: హరీశ్ రావు
22-02-2021 Mon 15:31
- బీజేపీ నేతలపై హరీశ్ రావు ఆగ్రహం
- ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం
- బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని వ్యాఖ్యలు
- బీజేపీకి ఎందుకు ఓటేయాలంటూ విసుర్లు

తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నోరు ఉంది కదా అని బీజేపీ నేతలు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారికి చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని అన్నారు. కేంద్రం పెద్దలను నిలదీయాలని సూచించారు. బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని, ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీలను అమ్మేయాలని చూస్తోందని ఆరోపించారు.
బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి?... పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓటు వేయాలా? అని హరీశ్ రావు నిలదీశారు. ఎరువుల సబ్సిడీని బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్లు తగ్గించారని వెల్లడించారు. బీజేపీ ఏమీ చేయకపోవడమే కాకుండా, రాష్ట్రానికి రావాల్సింది కూడా ఇవ్వడంలేదని విమర్శించారు.
Advertisement 2
More Telugu News
ప్రముఖ సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి కన్నుమూత
26 minutes ago

భైంసాలో జరిగిన హింస ఏమాత్రం మంచిది కాదు: కిషన్ రెడ్డి
57 minutes ago

Advertisement 3
రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక
1 hour ago

ఇది మా సెంటిమెంట్ కు సంబంధించిన విషయం: విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
1 hour ago

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
2 hours ago

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!
3 hours ago

బాలీవుడ్ హీరోతో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?
3 hours ago

Advertisement 4