ఈ మాత్రానికే చొక్కాలు చించుకుంటే ఎలా?: సజ్జల
21-02-2021 Sun 21:36
- ముగిసిన పంచాయతీ ఎన్నికలు
- టీడీపీ ఆఫీసు వద్ద సంబరాలు
- సెటైర్ వేసిన సజ్జల
- చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ స్థానంలా చూపారని విమర్శలు

ఏపీలో ఇవాళ్టితో పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తి అయ్యాయి. చివరి విడత పోలింగ్ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అటు విపక్ష టీడీపీ కూడా సంబరాలు చేసుకుంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పంచాయతీల్లో నాలుగు స్థానాలు గెలవగానే చొక్కాలు చించుకుంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.
ఈ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి పంచాయతీని ఓ అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో చూపించారని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోంది అనే అపవాదు వాస్తవం కాదన్నది ఈ ఫలితాలతో తేలిపోయిందని సజ్జల స్పష్టం చేశారు. ఓటమిని అంగీకరించలేని చంద్రబాబే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని ఉద్ఘాటించారు.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
7 hours ago

ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
8 hours ago

Advertisement 4