అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ రియల్ హీరోలు కాదు: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
20-02-2021 Sat 19:09
- దేశంలో చమురు ధరల పెంపు
- బాలీవుడ్ నటులు స్పందించడంలేదన్న నానా పటోలే
- అక్షయ్, అమితాబ్ కాగితం పులులని వ్యాఖ్యలు
- వారి సినిమాలు విడుదలైతే నిరసనలు తెలుపుతామని వెల్లడి

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో చమురు ధరలు మండిపోతుండడం పట్ల బాలీవుడ్ నటులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ నిజమైన హీరోలు కాదని అన్నారు.
ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వారు జనపక్షం వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వారికి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడబోనని, కానీ వారి వైఖరి పట్ల స్పందిస్తున్నానని పటోలే స్పష్టం చేశారు. వారిద్దరూ తమను తాము కాగితం పులులు అని అంగీకరిస్తే తాము ఇంకేమీ అభ్యంతరపెట్టబోమని తెలిపారు. ఇకపై వారిద్దరి సినిమాలు విడుదలైతే మాత్రం కాంగ్రెస్ శ్రేణులు నల్లజెండాలతో నిరసనలు తెలుపుతాయని వెల్లడించారు.
Advertisement 2
More Telugu News
జీడీపీ పెరుగుతున్నదంటే 'ఓహో' అనుకున్నాం... గ్యాస్, డీజిల్, పెట్రోల్ అనుకోలేదు!... సోషల్ మీడియాలో సెటైర్లు
14 minutes ago

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
1 hour ago

Advertisement 3
ఇతని తెలివికి ఆ అర్హత లేదు: ఆనంద్ మహీంద్రా
2 hours ago

ఆ కమిటీలో నేను లేను.. నారా లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
11 hours ago

బాక్సింగ్ నేర్చుకుంటున్న రాశిఖన్నా!
11 hours ago

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ!
12 hours ago

Advertisement 4