రజనీకాంత్ ను కలిసిన కమలహాసన్
20-02-2021 Sat 17:08
- ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమల్
- రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించిన రజనీ
- రజనీ ప్రకటన తర్వాత తొలిసారి కలిసిన కమల్

తన మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ను సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కలిశారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని రజనీకాంత్ ప్రకటించిన తర్వాత ఆయనను కమల్ కలవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కమల్ పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.
రజనీకాంత్ ను కమల్ కలవడం తమిళనాట సంచలనంగా మారింది. రజనీ మద్దతు కోరేందుకు కలిశారా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కమల్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని వారు తెలిపారు. 2018లో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని కమల్ ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి తన మిత్రుడు రజనీ మద్దతు కోరుతానని ఇటీవల కమల్ ప్రకటించారు.
Advertisement 2
More Telugu News
ప్రముఖ సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి కన్నుమూత
15 minutes ago

భైంసాలో జరిగిన హింస ఏమాత్రం మంచిది కాదు: కిషన్ రెడ్డి
46 minutes ago

Advertisement 3
రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక
1 hour ago

ఇది మా సెంటిమెంట్ కు సంబంధించిన విషయం: విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
1 hour ago

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
2 hours ago

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!
2 hours ago

బాలీవుడ్ హీరోతో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?
3 hours ago

Advertisement 4