తిరుమలలో వైభవంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
19-02-2021 Fri 06:36
- నిత్య కైంకర్యాల అనంతరం వేడుకలు ప్రారంభం
- ఏడు వాహనాలపైనా భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
- ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై దర్శనంతో మొదలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ తెల్లవారుజామున నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం ఉదయం 5.30 గంటలకు రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి వారు నేటి ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే వేడుకలు చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి.
ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై, 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపైనా స్వామివారు దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు శ్రీవారికి చక్రస్నానం చేయిస్తారు.
సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కల్పవృక్ష వాహనంపైన, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపైన, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపైన స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు.
Advertisement 2
More Telugu News
ప్రముఖ సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి కన్నుమూత
21 minutes ago

భైంసాలో జరిగిన హింస ఏమాత్రం మంచిది కాదు: కిషన్ రెడ్డి
53 minutes ago

Advertisement 3
రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక
1 hour ago

ఇది మా సెంటిమెంట్ కు సంబంధించిన విషయం: విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
1 hour ago

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
2 hours ago

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!
2 hours ago

బాలీవుడ్ హీరోతో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?
3 hours ago

Advertisement 4