కర్బన సంగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి 100 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించిన ఎలాన్ మస్క్
22-01-2021 Fri 15:45
- ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు
- పర్యావరణ హితం కోసం మస్క్ ప్రకటన
- వచ్చే వారం మరిన్ని వివరాలు వెల్లడిస్తానంటూ ట్వీట్
- తన ప్రకటనతో పోటీతత్వం పెరుగుతుందని భావిస్తున్న మస్క్

ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు వ్యాపార నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ఆయన విద్యుత్ కార్ల తయారీ వెనుక ప్రగాఢమైన పర్యావరణ హితం కూడా ఉంది. తాజాగా ఆయన కర్బన ఉద్గారాల నివారణ దిశగా ఆసక్తికర ప్రకటన చేశారు. కర్బన ఉద్గారాలను సమర్థంగా సంగ్రహించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్లు (రూ.730 కోట్లు) ఇస్తానని ట్వీట్ చేశారు.
కర్బన సంగ్రహణం కోసం రూపొందించే అత్యుత్తమ విధానానికి తన బహుమతి లభిస్తుందని, దీనికి సంబంధించిన ఇతర వివరాలను వచ్చేవారం వెల్లడిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. తన బహుమతి ప్రకటన ద్వారా పోటీతత్వం మరింత పెరిగి త్వరితగతిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఈ టెస్లా అధినేత భావిస్తున్నారు.
Advertisement 2
More Telugu News
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఘనంగా ఉత్సవాలు జరపాలన్న సీఎం కేసీఆర్
1 hour ago

విజయవాడలో జరిగింది కుటుంబ స్పర్ధ లాంటిదే... మూడు గంటల్లోనే పరిష్కరించుకున్నాం: నారా లోకేశ్
2 hours ago

10 లక్షల కరెన్సీ నోటు విడుదల చేసిన చిన్నదేశం
2 hours ago

Advertisement 3
Advertisement 4