నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం
21-01-2021 Thu 20:14
- అంగడిపేట వద్ద లారీని ఢీకొన్న ఆటో
- డ్రైవర్, ఐదుగురు మహిళల మృతి
- వరినాట్లు వేసి వస్తుండగా ప్రమాదం
- ప్రమాద సమయంలో ఆటోలో 21 మంది!
- సుద్దబావి తండాలో విషాదం

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కూలీలతో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆటో డ్రైవర్, మరో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆటోలో ప్రయాణిస్తున్నవారిని సుద్దబావి తండాకు చెందినవారిగా గుర్తించారు. వీరు వరినాట్ల నిమిత్తం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఓ బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చెన్నంపేట మండలం సుద్దబావి తండా శోకసంద్రాన్ని తలపిస్తోంది.
Advertisement 2
More Telugu News
బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత... ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబయి తరలింపు
7 minutes ago

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఇదిగో!
23 minutes ago

విశ్వాస పరీక్షలో గట్టెక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
50 minutes ago

ఏపీలో కొత్తగా 115 మందికి కరోనా పాజిటివ్
1 hour ago

Advertisement 3
భళా భారత్... అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లండ్ పై ఘనవిజయం... వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరిక
2 hours ago

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ!
3 hours ago

Advertisement 4