దేశంలో కొత్తగా 10,064 మందికి కరోనా
19-01-2021 Tue 10:03
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,81,837
- మృతుల సంఖ్య 1,52,556
- కోలుకున్న వారు 1,02,28,753 మంది

దేశంలో నమోదైన కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 10,064 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 17,411 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,05,81,837కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,556కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,28,753 మంది కోలుకున్నారు. 2,00,528 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,78,02,827 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,09,791 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
10 hours ago

Advertisement 4