సంక్రాంతి సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీ ఆర్టీసీ నిర్ణయం
19-12-2020 Sat 15:53
- మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ
- స్పెషల్ బస్సులు సిద్ధం చేస్తున్న ఏపీ ఆర్టీసీ
- జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు
- తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచీ బస్సులు

మరికొన్ని వారాల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్టీసీ 3,607 ప్రత్యేక బస్సులు తిప్పాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.
హైదరాబాదుతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 1,251 బస్సులు ఏర్పాటు చేశామని, బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులు తిప్పుతామని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201 బస్సులు, విశాఖపట్నంకు 551 బస్సులు తిరుగుతాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య 1,038 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని బ్రహ్మానందరెడ్డి చెప్పారు.
More Latest News
రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
27 seconds ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
13 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
15 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
16 minutes ago

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
23 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
43 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో పాసైన అవిభక్త కవలలు వీణా-వాణి
59 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
1 hour ago
