మళ్లీ నితీశ్ కుమారే సీఎం... బీహార్ లో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
15-11-2020 Sun 14:14
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
- పాట్నాలోని నితీశ్ నివాసంలో సమావేశమైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు
- నితీశే తమ నేతగా ఎన్నుకున్నవైనం
- నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టనున్న నితీశ్

బీహార్ లో మరోసారి నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో నితీశ్ కుమార్ ను బీహార్ లో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన మరోసారి సీఎం కానున్నారు. ఆయన సీఎం పీఠంపై కూర్చోనుండడం ఇది నాలుగో పర్యాయం.
బీహార్ రాజధాని పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసంలో ఇవాళ ఎన్డీయే శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ నేతగా నితీశ్ కుమార్ నే ఎన్నుకున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 125 స్థానాలు గెలుచుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూడిన మహాఘట్ బంధన్ కూటమిని ఓడించింది.
More Latest News
ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
16 minutes ago

సంజయ్ రౌత్కు మరోమారు ఈడీ సమన్లు
19 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
28 minutes ago

ఎంఎస్ స్వామినాథన్కు వెంకయ్య పరామర్శ
34 minutes ago

దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
50 minutes ago

టీహబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
55 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
1 hour ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
1 hour ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
1 hour ago
