చివరి చూపు కోసం పోటెత్తుతున్న అభిమానులు.. ఇంటి నుంచి ఫాంహౌస్ కు ఎస్పీ బాలు పార్థివదేహం తరలింపు
25-09-2020 Fri 20:29
- ప్రజల సందర్శనార్థం ఇంతసేపు స్వగృహం వద్ద బాలు భౌతికకాయం
- చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది అభిమానులు
- రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అందరినీ శోకసంద్రంలో ముంచుతూ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆసుపత్రి నుంచి బాలు మృతదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి అభిమానుల సందర్శనార్థం తరలించిన సంగతి తెలిసిందే. ఆయన చివరి చూపు కోసం వేలాది మంది అక్కడకు తరలి వచ్చారు. కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.
అయితే, అభిమానుల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో... కాసేపటి క్రితం ఇంటి నుంచి ఆయన పార్థివదేహాన్ని తామరైపాక్కంలో ఉన్న ఫాంహౌస్ కు తరలించారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
4 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
20 minutes ago

మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?
43 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
58 minutes ago

ఇంత నిర్లక్ష్యమా?... రోహిత్పై బీసీసీఐ పెద్దల గుర్రు!
59 minutes ago

టీమిండియా కెప్టెన్ గా అరుదైన రికార్డు సాధించిన పాండ్యా!
56 minutes ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
1 hour ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago

20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!
2 hours ago
