వరదలో కొట్టుకుపోయిన తెరాస నేత.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్న కేటీఆర్
17-08-2020 Mon 12:28
- సిద్ధిపేట జిల్లా శనిగరం, బద్దిపల్లి రోడ్డులో ఘటన
- ఇన్నోవా వాహనంలో వెళ్లిన జంగపల్లి శ్రీనివాస్
- ముగ్గురిని కాపాడిన స్థానికులు
- శ్రీనివాస్ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

సిద్ధిపేట జిల్లా శనిగరం, బద్దిపల్లి రోడ్డు మీదుగా ఇన్నోవా వాహనంలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో అక్కడి వాగులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లికు చెందిన టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ గల్లంతయ్యారు. వారు వాగులో కొట్టుకుపోతోన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా, శ్రీనివాస్ మాత్రం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.
దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించి.. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. గాలింపు చర్యలను పర్యవేక్షించడానికి సిద్ధిపేట ఆర్డీవో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
1 hour ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
2 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
3 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
3 hours ago
