రాఖీ పండుగపై పాటతో గుర్తింపు తెచ్చుకుని.. పండుగ ముందు రోజే ఆత్మహత్య చేసుకున్న సిద్ధిపేట రాజు
02-08-2020 Sun 13:30
- సిద్ధిపేటలో ఘటన
- ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే..’ పాటతో గుర్తింపు
- టిక్టాక్ స్టార్గా ఎదిగిన రాజు
- పొలం వద్ద ఉరి వేసుకున్న వైనం

రాఖీ పండుగపై పాటతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. చివరకు ఆ పండగ ముందు రోజే ఆత్మహత్య చేసుకుని తన అభిమానుల్లో విషాదాన్ని నింపాడు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి గడ్డం రాజు ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే.. ఇక లేడని ఇక రాడని చెప్పమ్మా’ అనే పాటతో గతంలో టిక్టాక్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే, ఈ రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. రాఖీ పండగ ముందు రోజే అతడి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఆ యువకుడు ఎందుకు బలన్మరణానికి పాల్పడ్డాడన్న విషయంపై కారణాలు తెలియాల్సి ఉంది. రాఖీ పండుగ పాటతో పాటు రాజు గతంలో అనేక పాటలు పాడి టిక్టాక్లో స్టార్గా ఎదిగాడు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
2 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
2 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
4 hours ago
