వికాస్ దూబే ఒక్కసారిగా షాక్ కు గురై చనిపోయాడు... పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
20-07-2020 Mon 13:58
- ఇటీవల ఎనిమిదిమంది పోలీసులను చంపేపిన దూబే
- దూబేను మట్టుబెట్టిన యూపీ పోలీసులు
- దూబే శరీరంపై నాలుగు బుల్లెట్ గాయాలు

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇటీవలే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబేను ఎన్ కౌంటర్ లో కాల్చిచంపడం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను చంపేసి యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ కు సవాల్ విసిరిన దూబేను పోలీసులు కొన్నిరోజుల వ్యవధిలోనే అంతమొందించారు.
ఉజ్జయిన్ లో అదుపులోకి తీసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ ను కాన్పూర్ తీసుకువస్తుండగా, వాహనం బోల్తాపడిందని, దాంతో పోలీసు కానిస్టేబుల్ నుంచి ఆయుధం లాక్కుని తమపైనే కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా, ఆ గ్యాంగ్ స్టర్ మృతి చెందాడన్నది పోలీసుల కథనం.
తాజాగా, వికాస్ దూబే పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దూబే శరీరంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, తీవ్ర రక్తస్రావం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే గాయాలతో పాటు ఒక్కసారిగా షాక్ తినడం వల్ల దూబే ప్రాణాలు విడిచాడని ఆ రిపోర్టులో వివరించారు.
More Latest News
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నటి మీనా భర్త మృతి
26 minutes ago

జనసేన కొత్త కార్యక్రమం 'జన వాణి'... ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కల్యాణ్
8 hours ago

తెలంగాణలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
9 hours ago

సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు పలికాడని తల నరికివేత... ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత
11 hours ago
