తమిళంలో రీమేక్ దిశగా 'ఉప్పెన'!
21-04-2020 Tue 13:22
- నాయకా నాయికలకు తొలి చిత్రంగా 'ఉప్పెన'
- దర్శకుడు బుచ్చిబాబుకి తొలి ప్రయత్నం
- విజయ్ సేతుపతి చేతికి తమిళ రీమేక్ హక్కులు

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' రూపొందింది. తెలుగులో ఆయనకి ఇదే తొలి సినిమా. ఈ సినిమా ద్వారానే కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. నాయకా నాయికలను తెలుగు తెరకి పరిచయం చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబుకి కూడా ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.
ఇప్పటికే తెలుగులో విడుదల కావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న విజయ్ సేతుపతి, మైత్రి వారి నుంచి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. నిర్మాణ భాగస్వాములుగా మైత్రి వారు ఉంటారని అంటున్నారు. తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, అక్కడ ఆయనే చేస్తాడని సమాచారం. ఇక నాయకా నాయికలుగా ఎవరిని తీసుకుంటారనేది త్వరలోనే తెలియనుంది.
More Latest News
సీఎం పదవి ఖాయం చేసుకుని రెబెల్స్ కు వీడియో కాల్ చేసిన షిండే... సంబరాలు చేసుకున్న రెబెల్స్!
2 minutes ago

అమరావతి ఉద్యోగులకు 5 రోజుల పని ఏడాది పాటు పొడిగింపు
11 minutes ago

ఉక్రెయిన్ లోని స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలగిన రష్యన్ సేనలు
31 minutes ago

50 రోజులను పూర్తిచేసుకున్న 'సర్కారువారి పాట'
49 minutes ago

ఒకేసారి ఇద్దరు కుమారులు మరణిస్తే డిప్రెషన్లోకి వెళ్లి.. మహారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
1 hour ago
