బ్రెయిన్ డెడ్, కార్డియాక్ అరెస్ట్... మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్!
09-03-2020 Mon 10:51
- శరీరంపై ఎటువంటి గాయాలూ గుర్తించలేదు
- మృతదేహం రంగు మారడానికి కారణం విషమే
- రక్త ప్రసారం ఆగి చనిపోయాడన్న వైద్యులు

నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, తమ ప్రాథమిక నివేదికను పోలీసు అధికారులకు అందించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆయన శరీరంపై ఎటువంటి గాయాలనూ వైద్యులు గుర్తించలేదని తెలుస్తోంది.
బ్రెయిన్ డెడ్, గుండెపోటు కారణంగా ఆయన మరణించారని, విషం తీసుకోవడమే ఇందుకు కారణమని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొంది. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
More Latest News
వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
8 minutes ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
33 minutes ago

మహేశ్ తో త్రివిక్రమ్ చేసేది మాస్ యాక్షన్ మూవీనే!
46 minutes ago

గుజరాత్ లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
49 minutes ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
1 hour ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
1 hour ago

బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'
1 hour ago

నితిన్ గడ్కరీని బీజేపీ కీలక పదవి నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన శరద్ పవార్ పార్టీ
1 hour ago
